Andhra Pradesh: జగన్ అన్నా.. సీఎం కాకముందే ఏపీ ప్రజలు నిన్ను రాక్ స్టార్ చేసేశారు!: ప్రశాంత్ కిశోర్ ప్రశంసలు

  • రావాలి జగన్-కావాలి జగన్ కు కోటి వ్యూస్
  • యూట్యూబ్ లో సరికొత్త రికార్డు
  • చంద్రబాబుకు ధ్యాంక్స్ చెప్పిన ప్రశాంత్ కిశోర్

వైసీపీ అధినేత జగన్ కు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ ప్రచార గీతం ‘రావాలి జగన్-కావాలి జగన్’ ను ఇంటర్నెట్ లో కోటి మంది వీక్షించిన నేపథ్యంలో ఆయన స్పందించారు.

‘యూట్యూబ్ లో కోటి మందికి పైగా వీక్షించిన తొలి రాజకీయ ప్రచార గీతంగా ‘రావాలి జగన్-కావాలి జగన్’ చరిత్ర సృష్టించింది. జగన్ అన్నా.. నువ్వు సీఎం అయ్యేలోపే ఏపీ ప్రజలు నిన్ను రాక్ స్టార్ చేసేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి నుంచి మరిన్ని విమర్శలు రాకముందే కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని ట్వీట్ చేశారు.

More Telugu News