Jammu And Kashmir: వేగంగా వెళుతూ లోయలోకి పల్టీకొట్టిన వాహనం.. ఆరుగురు దుర్మరణం!

  • జమ్మూకశ్మీర్ లోని రాజౌరీలో ఘటన
  • అదుపుతప్పి లోయలోకి జారిపోయిన వాహనం
  • ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తి పరిస్థితి విషమం

జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని దర్హాల్ ప్రాంతం వద్ద వేగంగా వెళుతున్న ఓ ప్రైవేటు వాహనం ఈరోజు తెల్లవారుజామున అదుపుతప్పి లోయలోకి జారిపోయింది. లోతైన ప్రాంతంలోకి వాహనం పల్టీలు కొట్టడంతో అందులోని ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు బాధితులను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News