Chittoor District: టీడీపీకి ఎస్సీవీ నాయుడు రాజీనామా.. రేపు వైసీపీలో చేరిక

  • చంద్రబాబు నన్ను నమ్మించి మోసం చేశారు
  • బొజ్జల వల్ల అనేక అనుమానాలకు గురయ్యా
  • రేపు వైసీపీలో చేరుతున్నా

టీడీపీకి మరో షాక్ తగిలింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేపు వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు తనను నమ్మించి మోసం చేశారని, ఐదేళ్లుగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వల్ల అనేక అనుమానాలకు గురయ్యానని, కార్యకర్తల సూచనల మేరకు తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు. ఈ ఎన్నికల్లో శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరులో టీడీపీని ఓడించి తీరతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, 2004-2009 మధ్య కాలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆయన పని చేశారు.

More Telugu News