nithin: 'భీష్మ' ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నాను: రష్మిక మందన

  • నితిన్ కథానాయకుడిగా 'భీష్మ'
  • నితిన్ కి బర్త్ డే విషెస్ చెప్పిన రష్మిక
  • తాను 'భీష్మ'లో చేస్తున్నట్టుగా ట్వీట్  

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ 'భీష్మ' సినిమా చేయనున్నాడు. ఈ రోజున నితిన్ పుట్టినరోజు కావడంతో,ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కథానాయికగా కొన్నిరోజుల క్రితమే రష్మిక మందనను ఎంపిక చేసుకున్నారు.

తాజాగా ఆమె ట్విట్టర్ ద్వారా నితిన్ కి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ ఏడాది ఆయనకి మరిన్ని విజయాలు చేకూరాలనే అభిలాషను వ్యక్తం చేసింది. అలాగే వెంకీ కుడుముల .. నితిన్ .. సూర్యదేవర నాగవంశీలతో కలిసి తాను ఈ సినిమా చేస్తున్న విషయాన్ని తన వైపు నుంచి స్పష్టం చేసింది. ఈ సినిమా షూటింగు ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని తాను ఎదురుచూస్తున్నట్టుగా ఆసక్తిని ప్రదర్శించింది. ఇక విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక చేసిన 'డియర్ కామ్రేడ్' మే నెలలో విడుదల కానుంది. 

More Telugu News