Andhra Pradesh: అమరావతిలో ఒక్క వీధి నిర్మాణం కూడా పూర్తికాలేదు.. ఇప్పుడు అధికారమిస్తే 20 హైదరాబాద్ లు కడతాడట!: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు

  • అదంతా గ్రాఫిక్స్ లోనే ఉంటుంది
  • 20 ఎందుకు 200 హైదరాబాద్ లు తయారుచేయండి
  • ప్రజలు చంద్రబాబును ఛీకొడుతున్నారు.

గత ఐదేళ్ల కాలంలో రాజధాని అమరావతిలో ఒక్క వీధి నిర్మాణం కూడా పూర్తికాలేదని వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. కానీ ఇంకో ఐదేళ్లు అవకాశమిస్తే 20 హైదరాబాద్ లు కడతానని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

ఇదంతా గ్రాఫిక్స్ లోనే ఉంటుందన్నారు. 20 కాకుండా 200 హైదరాబాద్ లను గ్రాఫిక్స్ లో తయారుచేయాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు సిగ్గులేకుండా అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చాలు.. తప్పుకోండి అని ప్రజలు ఛీకొడుతున్నారని వ్యాఖ్యానించారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘ఐదేళ్లలో అమరావతిలో ఒక వీధి కూడా పూర్తికాలేదు. ఇంకో ఐదేళ్లు అవకాశం ఇస్తే 20 హైదరాబాద్ లు కడతాడట. అంతా గ్రాఫిక్స్ లోనే కదా. 200 హైదరాబాద్ ల గ్రాఫిక్స్ తయారు చేయించండి. సిగ్గు లేకుండా అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నాడు. చేసిన మాయలు చాలు తప్పుకోండని ప్రజలు ఛీకొడుతున్నారు’ అని ట్వీట్ చేశారు.

More Telugu News