kalyani priyadarshan: శింబు సరసన ఛాన్స్ కొట్టేసిన కల్యాణి ప్రియదర్శన్

  • 'హలో'తో తెలుగు తెరకి పరిచయం 
  • తమిళంలో గట్టి ప్రయత్నాలు 
  • చేతిలో రెండు తమిళ సినిమాలు  

తెలుగు ప్రేక్షకులను 'హలో' చిత్రం ద్వారా కల్యాణి ప్రియదర్శన్ పలకరించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వలన వెంటనే ఈ అమ్మాయికి ఇక్కడ అవకాశాలు రాలేదు. సాయితేజ్ సరసన ఆమె చేసిన 'చిత్రలహరి' వచ్చేనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తమిళంలో ఈ అమ్మాయి చేసిన ప్రయత్నాలు ఫలించి వరుస అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం తమిళంలో ఆమె శివకార్తికేయన్ సరసన 'హీరో' అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా అలా సెట్స్ పైకి వెళ్లిందో లేదో .. మరో ప్రాజెక్టుకు కల్యాణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శింబు హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు ఒక పొలిటికల్ డ్రామాను పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన కల్యాణిని తీసుకున్నాడు. ఈ సినిమాకి 'మాన్నాడు' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది.

More Telugu News