Hyderabad: హైదరాబాద్ కు వచ్చి మరీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చూసిన ఉండవల్లి

  • ఏపీలో విడుదల కాని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
  • సిరాశ్రీ, ‘ఎమెస్కో’ అధినేత కలిసి సినిమా చూసిన వైనం
  • ఓ ఫొటో పోస్ట్ చేసిన సిరాశ్రీ

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఈ చిత్రం విడుదల కాలేదు. దీంతో, ప్రముఖ రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ హైదరాబాద్ కు వచ్చి ఈ చిత్రాన్ని వీక్షించారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను  ఓ థియేటర్ లో ఈరోజు చూశారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు గీత రచయిగా పని చేసిన సిరాశ్రీ, ‘ఎమెస్కో’ అధినేత విజయ్ కుమార్ లతో కలిసి ఉండవల్లి ఈ చిత్రం చూశారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను సిరాశ్రీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

More Telugu News