ISRO: మోదీకి మద్దతిస్తే చంపేస్తామంటూ ఇస్రో మాజీ చైర్మన్ కు బెదిరింపులు

  • మోదీకి మద్దతిస్తే ఊరుకోం
  • మా హెచ్చరికలు పట్టించుకోకపోతే చంపేస్తాం
  • ఓ లేఖలో హెచ్చరించిన పాక్ ఉగ్రవాద సంస్థ ‘జైషే’

ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతివ్వొద్దంటూ ఇస్రో మాజీ చైర్మన్, బీజేపీ నేత మాధవన్ నాయర్ ను బెదిరిస్తూ ఓ లేఖ వచ్చినట్టు సమాచారం. తమ హెచ్చరికలను కాదని మోదీకి మద్దతిస్తే మాధవన్ నాయర్ ని చంపేస్తామని ఆ లేఖలో హెచ్చరించారు. ఈ విషయాన్ని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ లేఖ పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ నుంచి వచ్చినట్టు పేర్కొన్నాయి. కాగా, ఈ లేఖ విషయమై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, 2003-2009 వరకు ఇస్రో చైర్మన్ గా మాధవన్ నాయర్ వ్యవహరించారు. మాధవన్ నాయర్ కు పలు పురస్కారాలు లభించాయి. గత ఏడాది అక్టోబర్ లో ఆయన బీజేపీలో చేరారు.

More Telugu News