tarak: భారీ షెడ్యూల్ కోసం బయల్దేరుతున్నా.. విమాన టికెట్లను అభిమానులతో షేర్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్

  • గుజరాత్ లో 'ఆర్ఆర్ఆర్' భారీ షెడ్యూల్
  • తెల్లవారుజామున బయల్దేరిన తారక్, రాంచరణ్, రాజమౌళి
  • ట్విట్టర్ ద్వారా తెలిపిన తారక్

తెలుగు సినిమాల ఖ్యాతిని నలుదిశలా చాటిన దర్శకదిగ్గజం రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. గుజరాత్ లో ఈ చిత్రానికి సంబంధించి భారీ షెడ్యూల్ ను తెరకెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో తారక్, రాం చరణ్, రాజమౌళి తదితరులు ఈ ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గుజరాత్ లోని వడోదరకు బయల్దేరారు.

ఈ విషయాన్ని తారక్ ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. 'ఆర్ఆర్ఆర్' భారీ షెడ్యూల్ కోసం బయల్దేరుతున్నానని ట్వీట్ చేశాడు. దీనికి తోడు ముగ్గురి టికెట్లను షేర్ చేశాడు. ఈ ట్వీట్ కు అభిమానులు భారీ ఎత్తున స్పందిస్తున్నారు. 'ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉండన్నా' అంటూ కామెంట్ చేస్తున్నారు.

More Telugu News