Lakshmi`s NTR: ఏప్రిల్ 3 వరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల చేయవద్దంటూ ఏపీ హైకోర్టు ఆదేశం

  • ఏప్రిల్ 3 వరకూ ఈ సినిమా రిలీజ్ చేయవద్దు 
  • న్యాయమూర్తి చాంబర్ లో ఈ సినిమా ప్రదర్శించాలి
  • నోటీసులు జారీ కాని వారికి నోటీసులివ్వాలని ఆదేశాలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఏప్రిల్ 3వ తేదీ వరకూ ఈ సినిమాను విడుదల చేయకూడదని హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 3వ తేదీ
సాయంత్రం నాలుగు గంటలకు న్యాయమూర్తి చాంబర్ లో ఈ సినిమా ప్రివ్యూ ప్రదర్శించాలని ఆదేశించింది.

ఈ ప్రదర్శనకు సినిమా నిర్మాత హాజరుకావాలని, సినిమా చూసిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది. ఈ సినిమాకు సంబంధించి నోటీసులు జారీ కాని వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. కాగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రేపు విడుదల కావాల్సి ఉంది. ఈ తరుణంలో ఈ చిత్రం విడుదలపై హైకోర్టు స్టే విధించడం గమనార్హం.

More Telugu News