Rajath kumar: జిల్లాల వారీగా బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్యను వెల్లడించిన రజత్ కుమార్

  • నేటితో ముగిసిన నామినేషన్ల గడువు
  • అత్యధికంగా నిజామాబాద్‌లో నామినేషన్లు
  • అతి తక్కువగా మెదక్ జిల్లాలో దాఖలు

తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. దీంతో నామినేషన్ ఉపసంహరించుకున్న వారు పోగా మిగిలిన వారి లిస్టును రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. అత్యధికంగా నిజామాబాద్‌లో నామినేషన్లు దాఖలు చేయగా, అతి తక్కువగా మెదక్ జిల్లాలో దాఖలయ్యాయి.

జిల్లాల వారీగా అభ్యర్థుల జాబితా ఇదే.. నిజామాబాద్ (185), సికింద్రాబాద్ (28), నల్గొండ (27), ఖమ్మం (23), చేవెళ్ల (23), పెద్దపల్లి (17), హైదరాబాద్ (15), కరీంనగర్ (15), వరంగల్ (15), మహబూబాబాద్(14), భువనగిరి (13), జహీరాబాద్ (12), మల్కాజిగిరి(12), మహబూబ్‌నగర్ (12), ఆదిలాబాద్ (11), నాగర్‌కర్నూలు (11), మెదక్ (10) మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

More Telugu News