SPY Reddy: పవన్ కల్యాణ్ కు ఝలక్... నామినేషన్ ఉపసంహరించుకునే ఆలోచనలో ఎస్పీవై రెడ్డి?

  • టీడీపీ నుంచి టికెట్ లభించక, జనసేనలో చేరిక
  • ఎస్పీవై రెడ్డి కుటుంబానికి మూడు టికెట్లిచ్చిన పవన్
  • చంద్రబాబు వ్యాఖ్యలతో మెత్తబడ్డ ఎస్పీవై రెడ్డి

తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ లభించక, జనసేనలో చేరి, ఆ పార్టీ తరఫున నంద్యాల లోక్ సభ స్థానానికి నామినేషన్ వేసిన హ్యాట్రిక్ ఎంపీ ఎస్పీవై రెడ్డి, తన మనసును మార్చుకోనున్నారా? అంటే అవుననే అంటున్నారు ఆయన అనుచరగణం. నిన్న నంద్యాలలో పర్యటించిన చంద్రబాబు, ఎస్పీవై రెడ్డి కుటుంబానికి తాను అన్యాయం చేయబోనని, టీడీపీ అభ్యర్థిని గెలిపించేందుకు ఆయన కృషి చేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు వ్యాఖ్యలతో మెత్తబడిన ఎస్పీవై రెడ్డి, తన నామినేషన్ ను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా, జనసేనలో ఎస్పీవై రెడ్డి చేరిన తరువాత, ఏకంగా మూడు టికెట్లను పవన్ కల్యాణ్ ఇచ్చారు. ఎస్పీవై రెడ్డికి నంద్యాల లోక్ సభ టికెట్ ను, ఆయన చిన్న కుమార్తె అరవిందరాణికి బనగానపల్లి అసెంబ్లీ టికెట్ ను, పెద్ద అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డికి నంద్యాల అసెంబ్లీ టికెట్ ను ప్రకటించారు. ఇప్పుడు ఎస్పీవై రెడ్డి తన నామినేషన్ ను ఉపసంహరించుకుంటే, అరవిందరాణి, శ్రీధర్ రెడ్డి కూడా తప్పుకుంటారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

More Telugu News