heroine: రూ. 500 కోట్ల హెరాయిన్ స్మగ్లింగ్.. బోటును ధ్వసం చేసిన కోస్ట్ గార్డ్స్

  • గుజరాత్ సముద్ర తీరంలో కోస్ట్ గార్డ్స్ దాడి
  • వందల కేజీల హెరాయిన్ ను తరలిస్తున్న ఇరాన్ జాతీయులు
  • స్మగ్లర్లను ప్రశ్నిస్తున్న నావికాదళ అధికారులు

హెరాయిన్ స్మగ్లర్లపై ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఉక్కుపాదం మోపారు. రూ. 500 కోట్ల విలువైన హెరాయిన్ ను తరలిస్తున్న బోటుపై దాడి చేసి, 9 మంది ఇరాన్ జాతీయులను పట్టుకున్నారు. అనంతరం బోటుతో పాటు మాదకద్రవ్యాలను ధ్వంసం చేశారు. గుజరాత్ రాష్ట్ర సముద్ర తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వందల కేజీల హెరాయిన్ ను ఇండియాలోకి అక్రమంగా తరలించేందుకు ఇరాన్ జాతీయులు ప్రయత్నిస్తుండగా... మన కోస్ట్ గార్డ్స్ దాన్ని గుర్తించారు. ప్రస్తుతం వారిని నావికాదళ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

More Telugu News