Ramgopal Varma: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చూసేందుకు ఎగబడుతున్న ప్రజలు... జై బాలయ్య: రామ్ గోపాల్ వర్మ

  • మొదలైన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అడ్వాన్స్ బుకింగ్స్
  • ఏంఎంబీ సినిమాస్ హౌస్ ఫుల్
  • ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మ

మరో రెండు రోజుల్లో విడుదల కానున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా, 10 నిమిషాల వ్యవధిలో ఓ మల్టీ ప్లెక్స్ లో 1000 టికెట్లు అమ్ముడు కావడాన్ని ప్రస్తావిస్తూ, ఓ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

"ఓపెనింగ్స్ స్పీడ్ చూస్తుంటే కథానాయకుడు, మహానాయకుడు కన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని చూడడానికే ప్రజలు ఎగబడుతున్నారు, అంటే నిజంగా నిజమే గెలిచిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. జై బాలయ్య" అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో హౌస్ ఫుల్ అయినట్టు చూపుతున్న థియేటర్ సీటింగ్ స్క్రీన్ షాట్ ను కూడా యాడ్ చేశారు.




More Telugu News