gudivada: డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నేతలు

  • గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ ద్విచక్ర వాహన ర్యాలీ
  • ర్యాలీకి వచ్చిన వారికి డబ్బులు పంచిన వైసీపీ నేతలు
  • మండిపడుతున్న ఇతర రాజకీయ పార్టీలు

ద్విచక్ర వాహనాల ర్యాలీకి వచ్చిన వారికి డబ్బులు పంచుతూ వైసీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో వైసీపీ ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా ర్యాలీకి వచ్చిన వారికి వైసీపీ నేతలు డబ్బులు పంచారు. ఈ వ్యవహారం కాస్తా కెమెరా కంటికి చిక్కింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. మరోవైపు, డబ్బుతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ వైసీపీపై ఇతర రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.

More Telugu News