saitej: 'చిత్రలహరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్

  • సాయితేజ్ నుంచి 'చిత్రలహరి'
  • ఏప్రిల్ 12వ తేదీన విడుదల
  • అందుకే మెగా హీరోలు దూరం   

సాయితేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా నిర్మితమైంది. కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ లోగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరుకానున్నట్టుగా తెలుస్తోంది. 'జనతా గ్యారేజ్' సమయం నుంచి మైత్రీ మూవీ మేకర్స్ వారికి ఎన్టీఆర్ తో మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన వాళ్ల ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ రానున్నాడని అంటున్నారు. వాస్తవానికి ఈ వేడుకకి చిరంజీవిగానీ .. చరణ్ గాని ముఖ్య అతిథులుగా రావలసి ఉందట. అయితే ఏపీ ఎన్నికల్లో 'జనసేన' పోటీ చేస్తుండటంతో, మీడియాకి దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్లు రావడం లేదని చెప్పుకుంటున్నారు. 

More Telugu News