Lakshmi's NTR: 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌'పై ఈ రాత్రికి నిర్ణయం తీసుకుంటామన్న ఎలక్షన్ కమిషన్!

  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలపై అభ్యంతరాలు
  • ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదులు
  • ఫిర్యాదులు పరిశీలిస్తున్నామన్న ద్వివేది

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో ఏపీ సీఎం చంద్రబాబును నెగటివ్ కోణంలో చూపించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తే అది తమ పార్టీపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి వీల్లేదంటూ ఎన్నో ఫిర్యాదులు ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి అందాయి. దీంతో ఆయన ఆ సినిమా విషయమై స్పందించారు.

నేడు ద్వివేది మీడియాతో మాట్లాడుతూ, సినిమాపై అందిన ఫిర్యాదులను పరిశీలించి సినిమా విడుదలపై రాత్రికల్లా ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే ఐటీ గ్రిడ్ విషయమై ద్వివేది మాట్లాడుతూ, ఈ కేసులో ఏపీ, తెలంగాణ సిట్‌కు తమ సహకారం పూర్తిగా ఉంటుందని అన్నారు.

More Telugu News