China: తప్పుగా చూపించారంటూ.. 30 వేల మ్యాప్ లను ధ్వంసం చేసిన చైనా

  • క్వింగ్డో పట్టణంలో ఘటన
  • సార్వభౌమత్యానికి భంగం కలిగిస్తున్నాయంటూ ఆగ్రహం
  • గతంలోనూ ఇదే తరహా వైఖరి

చైనా పొరుగుదేశాల ప్రాంతాలను తనవిగా చెప్పుకోవడం ఎప్పట్నించో జరుగుతోంది. భారత్ కు చెందిన అరుణాచల్ ప్రదేశ్, టిబెట్, తైవాన్ తదితర ప్రాంతాలు తనకు చెందినవన్నది చైనా భావన. అయితే, ఆ భూభాగాలను వాటి యథాతథ స్థితితో, ఆయా దేశాల పేరుతో మ్యాప్ లను తయారుచేశారని ఓ సంస్థపై చైనా ప్రభుత్వం మండిపడింది.

 అరుణాచల్ ప్రదేశ్ ను భారత భూభాగంగా, టిబెట్, తైవాన్ లను స్వతంత్ర దేశాలుగా చూపించారంటూ ఆ సంస్థ తయారుచేసిన సుమారు 30 వేల మ్యాప్ లను అధికారులు ధ్వంసం చేశారు. అన్హుయి ప్రావిన్స్ లోని క్వింగ్డో పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఓ విదేశీ కంపెనీ కోసం తాము సదరు మ్యాప్ లను తయారుచేశామని ఆ సంస్థ సిబ్బంది చెబుతున్నారు. చైనాకు తరచుగా పొరుగుదేశాలతో సరిహద్దు వివాదాలు వస్తుండడంతో, అక్కడ రూపొందించే మ్యాప్ లపై ప్రభుత్వ పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుంది.

More Telugu News