jandhyala: నేను ఎన్టీఆర్ అభిమానినని తెలిసి జంధ్యాలగారు అలా చేశారు: సీనియర్ నటుడు ప్రదీప్

  • జంధ్యాలగారు మా ఇంటికి భోజనానికి వచ్చారు
  • ఎన్టీఆర్ అంటే నాకెంత ఇష్టమో గ్రహించారు
  •  నాతో చెప్పిన మాటను నిజం చేశారు

నటుడిగా .. దర్శకనిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. " నేను ఎన్టీ రామారావుగారి అభిమానిని .. ఆయన సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. నేను 9వ క్లాస్ లో ఉండగా 'అడవి రాముడు' సినిమా విడుదలైంది. ఆ సినిమాకి జంధ్యాల గారు మాటలు రాశారు. మా మామయ్యకి ఆయన మంచి స్నేహితులు.

ఒక రోజున జంధ్యాల గారు మా ఇంటికి భోజనానికి వచ్చారు. నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టమనే సంగతి ఆ సమయంలోనే జంధ్యాలగారికి తెలిసింది. 'నిన్ను హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తాను .. ఆ సినిమా ప్రివ్యూకి ఎన్టీఆర్ గారిని పిలుస్తాను' అని ఆయన నాతో అన్నారు. ఆ తరువాత కొంతకాలానికి ఆయన నాతో 'ముద్దమందారం' సినిమా తీశారు. ఆ సినిమా ప్రివ్యూకి ఎన్టీఆర్ గారిని పిలిచారు. ఎన్టీఆర్ గారితో కలిసి ప్రివ్యూ చూడటం .. ఆయన అభినందనలు అందుకోవడం .. జంధ్యాల గారు ఎప్పుడో అన్నమాటను నిజం చేయడం ఎప్పటికీ మరిచిపోలేను" అని చెప్పుకొచ్చారు.

More Telugu News