Telangana: కేసీఆర్ ను చూస్తే ఇప్పుడు నీకు రోషమొస్తోందా చంద్రబాబు?: వాసిరెడ్డి పద్మ ఫైర్

  • కేసీఆర్ ను ఐదేళ్ల పాటు ఒక్క మాటన్నా అనలేదే?
  • ఎంత పిరికిపందవో ఏపీ ప్రజలకు అర్థమౌతోంది
  • బాబు, ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తోందా?

కేసీఆర్ ను చూస్తే ఇన్నాళ్లూ రాని రోషం ఇప్పుడొస్తోందా చంద్రబాబు? అంటూ వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ను ఐదేళ్ల పాటు ఒక్క మాటన్నా అనలేదని విమర్శించారు. ఎంత పిరికిపందవో ఏపీ ప్రజలకు అర్థమౌతోందని, ఇలాంటి పిరికిపందల వల్ల ఏపీకి ఎలాంటి ప్రయోజనం జరగదని, ఇన్నేళ్లూ ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే రాష్ట్రానికి నష్టం జరిగిందని దుమ్మెత్తి పోశారు. ఏపీలో కేసీఆర్ పెత్తనం అని చంద్రబాబు మాట్లాడుతున్నాడని, ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తోందా? అని ప్రశ్నించారు.

 చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులందరినీ టీఆర్ఎస్, కాంగ్రెస్ లోకి పంపించారని ఆరోపించారు. తెలంగాణలో మహాకూటమి అని ఏర్పాటు చేసి చతికిలపడ్డారని విమర్శించారు. తెలంగాణ ఎన్నికల కోసం ఇదే కేసీఆర్ తో పొత్తు కోసం చంద్రబాబు పాకులాడలేదా? అని ప్రశ్నించారు. ‘టీఆర్ఎస్ తో నువ్వు  రాజకీయం చేస్తే తెలుగు ప్రజలు కలిసుండటానికి.. రాజకీయం చేయకపోతే ఏపీకి కేసీఆర్ రాక్షసుడా? ఇదా నీ రాజకీయం?’ అని చంద్రబాబుపై వాసిరెడ్డి విరుచుకుపడ్డారు.

More Telugu News