surya: 'ఎన్జీకే' సినిమా విడుదలకు ముహూర్తం కుదిరింది

  • పొలిటికల్ డ్రామాగా 'ఎన్జీకే'
  • ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న సంగీతం
  • మే 31వ తేదీన విడుదల

సూర్య తాజా చిత్రంగా .. ఎస్.ఆర్. ప్రభు నిర్మాణంలో 'ఎన్జీకే' సినిమా నిర్మితమైంది. ఈ పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ .. సాయిపల్లవి కనిపించనున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేయాలని అనుకున్నారు.

కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడం వలన, విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. మే 31వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాతో సూర్యకి హిట్ పడుతుందేమో చూడాలి మరి.

More Telugu News