prabhas: సిన్సియర్ లవర్ గా .. ప్లే బాయ్ గా ప్రభాస్?

  • రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్
  •  తొలిసారిగా ద్విపాత్రాభినయం
  •  మరో కథానాయికగా కాజల్  

'సాహో' షూటింగు చాలా వరకూ పూర్తికావడంతో, 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ సినిమాపై ప్రభాస్ దృష్టిపెట్టాడు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, రీసెంట్ గా మరో షెడ్యూల్ ను మొదలుపెట్టింది. 1960 కాలం నాటి ప్రేమకథతో ఈ సినిమా సాగుతుందనే వార్తలు ఇంతకుముందే వినిపించాయి. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనేది తాజా సమాచారం.

కథాపరంగా ఆయన ఒక పాత్రలో సిన్సియర్ లవర్ గా .. మరో పాత్రలో ప్లే బాయ్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఇక ఇప్పటివరకూ ఈ సినిమాలో నాయికగా పూజా హెగ్డే పేరు మాత్రమే వినిపించింది. మరో కథానాయికగా కాజల్ కనిపించనుందనేది కూడా తాజాగా తెలిసిన విషయమే. సిన్సియర్ లవర్ కి జోడీగా పూజా హెగ్డే .. ప్లే బాయ్ పాత్ర సరసన కాజల్ కనిపిస్తుందని అంటున్నారు. ఈ విషయాలు ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచడం ఖాయమని చెప్పుకోవచ్చు. 

More Telugu News