Guntur: గుంటూరులో పర్యటన.. పార్టీ అభ్యర్థి రెహ్మాన్ ఇంటిని సందర్శించిన పవన్ కల్యాణ్

  • గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గం అభ్యర్థి రెహ్మాన్
  • ఇస్లాం మ‌త గ్రంథాన్ని చదివి వినిపించిన రెహ్మాన్ త‌ల్లి
  • పవన్ కు రుచికరమైన వంటలతో ఆతిథ్యం 

గుంటూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌ కల్యాణ్ గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ‘జ‌న‌సేన’ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న షేక్ జియా ఉర్‌ రెహ్మాన్ ఇంటిని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా రెహ్మాన్ త‌ల్లి ఇస్లాం మ‌త గ్రంథాన్ని చ‌దివి వినిపించ‌గా ఏకాగ్రతతో ఆయన విన్నారు. ప‌వ‌న్‌ రాక‌ను పుర‌స్క‌రించుకుని రుచికరమైన వంటలతో ఆతిథ్యం ఏర్పాటు చేశారు. ఆ రుచికరమైన వంటలను పవన్, పార్టీ నేతలు ఆరగించారు.

More Telugu News