nagarjuna: 'మన్మథుడు 2'ను లాంచ్ చేసేశారు

  • 'మన్మథుడు 2' షూటింగు మొదలు
  • ఏప్రిల్ 12 నుంచి ఫారిన్ షెడ్యూల్ 
  • సంగీత దర్శకుడిగా చేతన్ భరద్వాజ్      

నాగార్జున కథానాయకుడిగా గతంలో వచ్చిన 'మన్మథుడు' భారీ విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలోనే నాగార్జున వున్నారు .. తాజాగా ఆ ప్రయత్నం ఫలించింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రంగం సిద్ధమైందని వార్తలు వచ్చాయి. అలాగే కొంత సేపటి క్రితం ఈ సినిమాను లాంచ్ చేశారు.ముందుగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి .. అమల క్లాప్ కొట్టగా .. చైతూ కెమెరా స్విచ్చాన్ చేయగా దేవుడి పటాలపై ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. మనం ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన రకుల్ కథానాయికగా నటిస్తోంది. ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగును మొదలెట్టేశారు. ఏప్రిల్ 12 నుంచి ఫారిన్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. 'ఆర్ ఎక్స్ 100'కి సంగీతాన్ని అందించిన చేతన్ భరద్వాజ్, ఈ సినిమాకి బాణీలు కడుతున్నాడు.

More Telugu News