sai tej: అమెరికా వెళ్లడానికి అసలు కారణమదే: సాయితేజ్

  • 'విన్నర్' షూటింగు సమయంలో గాయపడ్డాను
  • కాలు నొప్పితో బాధపడ్డాను 
  • అమ్మ చాలా కంగారు పడిపోయింది  

సాయితేజ్ హీరోగా 'చిత్రలహరి' రూపొందింది. కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూతో అనేక సందేహాలకు సాయితేజ్ తెరదించాడు. "ఇటీవల నేను అమెరికా వెళ్లడంతో బరువు తగ్గాలనే ఉద్దేశంతో .. లైపో చేయించుకోవడానికి వెళ్లాననే ప్రచారం జరిగిందట.

ఇక జుట్టు బాగా రాలిపోతుండటంతో, అందుకు సంబంధించిన ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లానని చెప్పుకున్నారట. కానీ ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. 'విన్నర్' షూటింగు సమయంలో గుర్రంపై నుంచి పడిపోవడం వలన గాయపడ్డాను. పెద్దగా పట్టించుకోకుండా వరుస సినిమాలు చేయడం వలన, కాలు నొప్పి మరింత ఎక్కువైంది. అమ్మ కాంగారు పడుతుండటంతో, ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లాను .. అంతే." అని చెప్పుకొచ్చాడు.

More Telugu News