ram: 'ఇస్మార్ట్ శంకర్' షూటింగ్ అప్ డేట్

  • 'గోవా'లో షూటింగు పూర్తి
  • తదుపరి షెడ్యూల్ వారణాసిలో 
  • మే నెలలో విడుదల చేసే ఛాన్స్        

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' సినిమా రూపొందుతోంది. నిధి అగర్వాల్ .. నభా నటేశ్ కథానాయికలుగా ఈ సినిమా నిర్మితమవుతోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా 'గోవా'లో షూటింగు జరుపుకుంటోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు.

నిన్న రాత్రితో అక్కడ షూటింగు పూర్తయింది. ఈ సందర్భంగా అంతా కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసినట్టుగా చార్మీ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఆ సందర్భంలో దిగిన ఒక సెల్ఫీని షేర్ చేసింది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను 'వారణాసి' (కాశీ)లో ప్లాన్ చేశారు. కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఆ తరువాత పాటల చిత్రీకరణ కోసం ఈ సినిమా టీమ్ విదేశాలకు వెళ్లనుంది. మే నెలలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

More Telugu News