Andhra Pradesh: ఇదే ఫైనల్.. తుది జాబితాను ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్!

  • 19 అసెంబ్లీ, మూడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
  • నేటితో నామినేషన్లకు ముగియనున్న గడువు
  • ఇప్పటికే ఐదు జాబితాలు విడుదల చేసిన జనసేన

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నామినేషన్లకు గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో జనసేన పార్టీ తుది జాబితాను ప్రకటించింది. ఇందులో భాగంగా 19 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాల్లో పోటీచేయబోయే అభ్యర్థుల పేర్లను ఈరోజు విడుదల చేసింది. ఇప్పటికే ఐదు జాబితాలను పవన్ కల్యాణ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనసేన తుది జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులు వీరే.

అసెంబ్లీ సీట్లు దక్కించుకున్న అభ్యర్థులు..
కందుకూరు- పులి మల్లికార్జునరావు
ఆత్మకూరు- జి.చిన్నారెడ్డి
బనగానపల్లి- సజ్జల అరవింద్‌ రాణి
శ్రీశైలం- సజ్జల సుజల

ఆలూరు- ఎస్‌ వెంకప్ప
పెనుకొండ- పెద్దిరెడ్డిగారి వరలక్ష్మి
పత్తికొండ-  కెఎల్‌ మూర్తి
ఉరవకొండ- సాకే రవికుమార్‌

నరసన్నపేట- మెట్ట వైకుంఠం
విజయనగరం- పాలవలస యశస్వి
గజపతి నగరం- రాజీవ్‌ కుమార్‌ తలచుట్ల
నర్సీపట్నం- వేగి దివాకర్‌
వినుకొండ- చెన్నా శ్రీనివాసరావు

అద్దంకి- కంచెర్ల శ్రీకృష్ణ
యర్రగొండపాలెం (ఎస్సీ)- డాక్టర్‌ గౌతమ్‌
శింగనమల (ఎస్సీ)- సాకే మురళీకృష్ణ
పుట్టపర్తి- పత్తి చలపతి

చిత్తూరు- ఎన్‌.దయారామ్‌
కుప్పం- డాక్టర్‌ వెంకటరమణ

జనసేన లోక్ సభ అభ్యర్థులు..
విజయవాడ- ముత్తంశెట్టి సుధాకర్‌
హిందూపూర్‌- కరీముల్లా ఖాన్‌  
నరసరావుపేట- నయూబ్‌ కమాల్‌

More Telugu News