lakshmis ntr: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా మాకు చూపించండని ఆదేశించిన ఈసీ.. నేడు కలవనున్న నిర్మాత

  • చంద్రబాబును టార్గెట్ చేస్తూ వర్మ చిత్రం
  • పోలింగ్ ముగిసేంత వరకు విడుదలను ఆపేయాలంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు
  • చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ చేసిన ఈసీ

ఎన్నికల సమయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించడంతో.. టీడీపీ శ్రేణులు కలవరపాటుకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసేంత వరకు ఈ చిత్రం విడుదలను ఆపేయాలని శ్రీకాళహస్తికి చెందిన మోహన్ రావు అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని తమకు చూపించాలంటూ నిర్మాత రాకేష్ రెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.ఈ నేపథ్యంలో, ఈరోజు ఎన్నికల సంఘం ముందుకు రాకేష్ రెడ్డి హాజరుకానున్నారు.

More Telugu News