India: మొజాంబిక్ లో తుపాను నుంచి 192 మందిని కాపాడిన భారత నేవీ

  • ఆఫ్రికా దేశం మొజాంబిక్ లో తుపాను
  • ఆదుకోవాలంటూ విజ్ఞప్తి
  • వెంటనే స్పందించిన భారత్

భారత నౌకాదళం ఆఫ్రికా దేశం మొజాంబిక్ లో సంభవించిన తుపాను నుంచి 192 మందిని కాపాడింది. మార్చి 15న ఇడాయ్ తుపాను మొజాంబిక్ తీరప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. అయితే, తీరంలో చాలా ప్రాంతం ధ్వంసమైపోవడంతో మొజాంబిక్ తన వద్ద ఉన్న సహాయక సంపత్తి చాలదంటూ భారత్ ను సాయం కోరింది.

ఈ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన భారత నేవీ వెంటనే బెయిరా ప్రాంతానికి మూడు భారీ నౌకలను పంపింది. గత కొన్నిరోజులుగా భారత నావికా బృందాలు మొజాంబిక్ లో తుపాను కారణంగా చిక్కుకుపోయిన 192 మందిని కాపాడడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వెయ్యి మందికి పైగా సాయం అందిస్తోంది. భారత నేవీకి చెంది చేతక్ హెలికాప్టర్ కూడా మొజాంబిక్ సహాయక బృందాలతో కలిసి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తోంది.

More Telugu News