China: మాంసం నరికే కత్తులు, పాములతో మసాజ్... కొత్త ట్రెండ్ ఇదే!

  • చైనాలో వింత పోకడలు
  • పదునైన కత్తులు, కొండచిలువలతో మసాజ్
  • పెరుగుతున్న డిమాండ్

బాడీ మసాజ్ లో సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా కత్తులు, పాములతో మసాజ్ చేయడం నిజంగా దిగ్భ్రాంతి కలిగించేే విషయం. కానీ చైనాలో ఇప్పుడిదే సరికొత్త ట్రెండ్ గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా మసాజ్ సెంటర్లు కూడా ఏర్పాటయ్యాయి. ఈ మసాజ్ సెంటర్లలో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన కత్తులను మసాజ్ ఉపకరణాలుగా ఉపయోగిస్తారు. అంతేకాదు, అర క్వింటాలు బరువుండే కొండచిలువ పాములు కూడా కస్టమర్లకు మసాజ్ చేసేందుకు వినియోగిస్తారు.

ముందుగా మసాజ్ కోసం వచ్చిన వ్యక్తిని టేబుల్ పై పడుకోబెట్టి మందపాటి దుప్పటి కప్పేస్తారు. బాగా సానబెట్టిన కత్తులతో తలనుంచి పాదాల వరకు కత్తులతో సున్నితంగా కొడుతూ మసాజ్ చేస్తారు. దీన్ని నైఫ్ మసాజ్ అంటారు. ఇక స్నేక్ మసాజ్ లో భాగంగా దాదాపు 50 కిలోల బరువుండే కొండచిలువను కస్టమర్ శరీరంపై పాకేలా చేస్తారు. పాము రక్తం చల్లగా ఉంటుంది కాబట్టి మనిషి శరీరానికి పూర్తి సాంత్వన చేకూరుతుందని చైనీయులు విశ్వసిస్తారు. ఇప్పుడు చైనాలో టీనేజర్లు సైతం ఈ కొత్త తరహా మసాజ్ ల కోసం ఆసక్తి చూపిస్తున్నారట.

More Telugu News