Virat Kohli: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సురేశ్ రైనా

  • ఐదు వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా రైనా
  • ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో రికార్డు
  • రెండో స్థానంలో ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చరిత్ర సృష్టించాడు. 5 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో 19 పరుగులు చేసిన రైనా.. 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో 5004 పరుగులతో రైనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 4954 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ (4493), గౌతం గంభీర్ (4217) పరుగులో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

More Telugu News