Rashi Khanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రాశిఖన్నా మళ్లీ బిజీ బిజీ 
  • జూలై నుంచి బాలకృష్ణ సినిమా 
  • 'ఏబీసీడీ' మరోసారి వాయిదా 
  • వాల్మీకి షూటింగుకి వరుణ్ తేజ్ 

*  తెలుగులో ప్రస్తుతం 'వెంకీమామ' చిత్రంలో నటిస్తున్న రాశిఖన్నా మరోపక్క తమిళంలో బిజీగా వుంది. విశాల్ తో తాజాగా 'అయోగ్య' చిత్రంలో నటించిన రాశి, విజయ్ సేతుపతితో 'స్కెచ్' అనే సినిమా చేస్తోంది. దీంతో ఇటు హైదరాబాదుకి, అటు చెన్నయ్ కి షూటింగుల కోసం షటిల్ సర్వీస్ చేస్తోంది.
*  బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందే చిత్రం షూటింగ్ ప్రారంభం మరో నెల ముందుకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగును జూన్ నెలలో ప్రారంభించాలని మొదట్లో అనుకున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం, జూలై నుంచి షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.
*  అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఏబీసీడీ' చిత్రం విడుదల మరోసారి వాయిదా పడేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఇది పలుసార్లు వాయిదా పడి, ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందని చెబుతూ వచ్చారు. అయితే, ఈ వేసవికి ఇక ఈ చిత్రం లేదని తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మే తర్వాత మాత్రమే దీనిని రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట.
*  'ఎఫ్ 2' తరువాత వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'వాల్మీకి'. తమిళంలో వచ్చిన 'జిగర్తాండ' చిత్రం ఆధారంగా హరీశ్ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగులో వరుణ్ వచ్చే నెల 16న జాయిన్ అవుతాడట. 

More Telugu News