Vangaveeti Radhakrishna: వంగవీటి రాధాతో సెల్ఫీ కోసం పోటీపడిన జనసేన కార్యకర్తలు

  • ముద్దరబోయిన నామినేషన్ కార్యక్రమానికి హాజరైన రాధా
  • నామినేషన్ వేసేందుకు వచ్చిన బసవ భాస్కరరావు
  • రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా సెల్ఫీ వ్యవహారం

టీడీపీ గెలుపునకు కృషి చేస్తానని చెప్పినట్టుగానే వంగవీటి రాధాకృష్ణ ఆ పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే నేడు ఆశ్చర్యపరిచే సన్నివేశం ఒకటి రాధా విషయంలో జరిగింది. నూజివీడు టీడీపీ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నామినేషన్ వేశారు. అదే సమయంలో జనసేన అభ్యర్థి బసవ భాస్కరరావు కూడా నామినేషన్ వేసేందుకు హాజరయ్యారు. అయితే ముద్దరబోయిన నామినేషన్ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతున్న రాధాతో సెల్ఫీలు తీసుకొనేందుకు జనసేన కార్యకర్తలు పోటీ పడ్డారు.  

More Telugu News