nikhil: ఎక్కడికి వెళ్లినా అలాగే పిలుస్తున్నారు: లావణ్య త్రిపాఠి

  • 'అందాల రాక్షసి'తో పరిచయం
  • వెంటవెంటనే భారీ విజయాలు
  • 'అర్జున్ సురవరం'లో రిపోర్టర్ పాత్ర  

'అందాల రాక్షసి' సినిమాతో వెండితెరకి పరిచయమైన నాజూకు సుందరి లావణ్య త్రిపాఠి, ఆ తరువాత 'భలే భలే మగాడివోయ్' .. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలతో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'అర్జున్ సురవరం' .. విడుదలకి సన్నాహాలు చేసుకుంటోంది.

తాజా ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ .. 'అందాల రాక్షసి' నా మొదటి సినిమా కావడం నేను చేసుకున్న అదృష్టం. ఈ సినిమా నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఎక్కడికి వెళ్లినా 'అందాల రాక్షసి' అనే పిలుస్తూ వుంటే ఆనందంగా వుంది. 'అర్జున్ సురవరం' సినిమాలో నేను హీరోతో పాటు ఒక రిపోర్టర్ గా కనిపిస్తాను. చాలా రోజుల తరువాత ఒక డిఫరెంట్ రోల్ చేశాననిపించింది. ఈ పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది' అని చెప్పుకొచ్చింది.  

More Telugu News