nikhil: 'అర్జున్ సురవరం' విడుదల వాయిదా?

  • నిఖిల్ హీరోగా 'అర్జున్ సురవరం'
  • ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ ఈ నెల 29
  • మే 1వ తేదీకి వాయిదా వేయాలనే ఆలోచన    

నిఖిల్ కథానాయకుడిగా టీఎన్ సంతోష్ దర్శకత్వంలో 'అర్జున్ సురవరం' సినిమా రూపొందింది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 29వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. ఏప్రిల్ 30వ తేదీన ఎన్నికలు వుంటాయనే  ఉద్దేశంతో, మార్చి 29ని ఖరారు చేసుకున్నారు.

ఆ తరువాత ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన జరపడం ఖరారైపోయింది. ఇప్పుడు ఈ సినిమాను ఎన్నికలకి 10 రోజుల ముందు విడుదల చేయడం కరెక్ట్ కాదని ఈ సినిమా టీమ్ భావిస్తోందట. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నికల ప్రచారం మంచి ఊపుతో జరుగుతూ ఉంటుంది. ఎన్నికల గురించే జనమంతా మాట్లాడుకుంటూ వుంటారు .. వాళ్ల దృష్టి అంతా కూడా రాజకీయ పరిణామాలపైనే ఉంటుంది. అందువలన ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను విడుదల చేయకుండా, మే1వ తేదీకి వాయిదా వేయాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

More Telugu News