Tamilnadu: జేబులో నుంచి రూ. 500 లేపేసిన భార్య... నామినేషన్ వేయలేకపోయిన భర్త!

  • తమిళనాడులోని విల్లుపురంలో ఘటన
  • ఇంటి ఖర్చు కోసం డబ్బు తీసుకున్న భార్య
  • చేసేదేమీ లేక వెనుదిరిగిన అరసన్

ఈ ఎన్నికల్లో అతను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయాలని అనుకున్నారు. నామినేషన్ కు డిపాజిట్ గా రూ. 12,500 కట్టాల్సి వుండటంతో ఆ డబ్బును రెడీ చేసుకుని రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లాడు. డబ్బు కట్టే సమయంలో చూసుకుంటే రూ. 500 తగ్గింది. వెంటనే ఇంటికి ఫోన్ చేయగా, ఇంటి ఖర్చుల నిమిత్తం తానే తీసుకున్నానని భార్య చెప్పడంతో, చేసేదేమీ లేక తరువాత నామినేషన్ వేస్తానని చెప్పిన ఆయన, వెనుదిరగాల్సి వచ్చింది. ఈ విచిత్రమైన ఘటన తమిళనాడులో జరిగింది.

విల్లుపురం నియోజకవర్గంలో పోటీ పడాలని భావించిన పాండూరు గ్రామవాసి, అరసన్, కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వేళ, తన జేబులో డబ్బు తగ్గిన విషయాన్ని గుర్తించారు. కాగా, అరసన్ 2014 ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్ గా పోటీ పడగా, ఆయనకు 811 ఓట్లు రావడం గమనార్హం.

More Telugu News