nithin: మరో సినిమాను కూడా ప్రకటించేసిన నితిన్

  • త్వరలో సెట్స్ పైకి 'భీష్మ'
  • తరువాత సినిమా చంద్రశేఖర్ యేలేటితో 
  • ఆగస్టులో రమేశ్ వర్మతో సినిమా   

కొంతకాలంగా సరైన హిట్ లేక నితిన్ నిరాశలో వున్నాడు. మంచి కథల కోసం వెయిట్ చేస్తూ వచ్చిన నితిన్, ఈ ఏడాది మూడు సినిమాలతో ఫుల్ బిజీ కానున్నాడు. ముందుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ 'భీష్మ' సినిమా చేయనున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే .. తన నుంచి మరో రెండు సినిమాలు ఈ ఏడాది ఉంటాయనీ, ఆ ప్రాజెక్టుల వివరాలను ఈ నెలాఖరులో చెబుతానని కొన్ని రోజుల క్రితం అన్నాడు.

చెప్పినట్టుగానే నితిన్ ఆ రెండు సినిమాల విశేషాలను ఈ రోజున అభిమానుల ముందుంచాడు. రమేశ్ వర్మతో ఒక సినిమా ఉంటుందనీ .. అది ఆగస్టులో సెట్స్ పైకి వెళుతుందని ఆయన చెప్పాడు. అలాగే ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమా ఉంటుందనీ, అది ఏప్రిల్ రెండవ వారంలో సెట్స్ పైకి వెళుతుందని అన్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తారని స్పష్టం చేశాడు.

More Telugu News