Andhra Pradesh: దేవినేని అవినాష్, పరిటాల శ్రీరామ్‌కు శుభాకాంక్షలు చెప్పిన మంచు విష్ణు

  • ఏపీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న శ్రీరామ్, అవినాష్
  • రాప్తాడు నుంచి శ్రీరామ్, గుడివాడ నుంచి అవినాష్ పోటీ
  • రాజకీయాల్లో వీళ్లిద్దరూ వారి తండ్రుల స్థాయికి చేరాలి

ఏపీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేతల వారసులు బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ వారసుల్లో పరిటాల సునీత తనయుడు శ్రీరామ్, దివంగత దేవినేని నెహ్రూ తనయుడు అవినాష్ కూడా ఉన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నుంచి శ్రీరామ్, కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం నుంచి అవినాష్ లు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న శ్రీరామ్, అవినాష్ లకు ప్రముఖ హీరో మంచు విష్ణు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో వీళ్లిద్దరూ వారి తండ్రుల స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తున్నట్టు విష్ణు ఓ ట్వీట్ లో తెలిపాడు.  

More Telugu News