modi: మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూనే.. హెచ్చరించిన శత్రుఘ్న సిన్హా

  • మోదీ చౌకీదార్ క్యాంపెయిన్ ను ఎద్దేవా చేసిన సిన్హా
  • వారం క్రితం 'నేను కూడా కాపలాదారుడినే' క్యాంపెయిన్ ప్రారంభించిన మోదీ
  • చౌకీదార్ అనే పదాన్ని తమ పేర్ల ముందు చేర్చుకుంటున్న బీజేపీ నేతలు

ప్రధాని మోదీని బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా సున్నితంగా హెచ్చరించారు. హోలీ సందర్భంగా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. 'హోలీ శుభాకాంక్షలు సర్ జీ. చౌకీదార్ పేరుతో ప్రచారం చేసుకుంటున్న మిమ్మల్ని గౌరవంగా, ఇదే సమయంలో స్పష్టంగా హెచ్చరిస్తున్నా. కాపలాదారుడి పేరుతో మిమ్మల్ని మీరు ఎంత ఎక్కువగా రక్షించుకోవాలని భావిస్తే... అంతకన్నా ఎక్కువగా రాఫెల్ డీల్, మీరు ఇప్పటి వరకు సమాధానాలు చెప్పని ప్రశ్నల గురించి సమాధానాలు తెలుసుకోవాలనే ఆత్రుత ప్రజల్లో పెరుగుతుంది' అంటూ సిన్హా ట్వీట్ చేశారు.

గత వారం సోషల్ మీడియా ద్వారా 'నేను కూడా కాపలాదారుడినే' అనే ప్రచారాన్ని మోదీ ప్రారంభించారు. అంతేకాదు తన ట్విట్టర్ అకౌంట్లో తన పేరు ముందు చౌకీదార్ అనే టైటిల్ ను తగిలించుకున్నారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే అమిత్ షా సహా బీజేపీ నేతలంతా తమ పేర్ల ముందు చౌకీదార్ పేరును చేర్చుకున్నారు.

More Telugu News