Andhra Pradesh: నేను వచ్చాకే మీ ఊరికి నీరు వచ్చింది.. మీ మొహాల్లో నవ్వు వచ్చింది!: సీఎం చంద్రబాబు

  • నేను వస్తున్నానని ప్రతిపక్షం బెంబేలెత్తిపోతోంది
  • మా ప్రభుత్వం వచ్చాకే గ్రామాల్లో విద్యుత్ వచ్చింది
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

తాను వస్తుంటే ప్రతిపక్షం బెంబేలెత్తిపోతోందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. తాను ముఖ్యమంత్రి అయ్యాకే గ్రామాలకు విద్యుత్ వచ్చిందనీ,  ప్రజల ముఖాల్లో నవ్వు వచ్చిందని వ్యాఖ్యానించారు. తాను వచ్చాకే ప్రజల్లో నమ్మకం వచ్చిందన్నారు.

ఈరోజు చంద్రబాబు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘"బాబు వచ్చాడు", "బాబువచ్చాడు" అని బెంబేలేత్తి పోతుంది ప్రతిపక్షం. ఎందుకంటే...?
నేనొచ్చాక మీ ఊరికి నీరొచ్చింది..
నేనొచ్చాక ప్రజల మోహాల్లో నవ్వొచ్చింది..
నేనొచ్చాక నమ్మకం వచ్చింది..
నేనొచ్చాక ఆత్మవిశ్వాసం పెరిగింది..
నేనొచ్చాక ప్రతిపక్షాలకు వణుకొచ్చింది’ అని తెలిపారు.

ప్రతి రోజు నేరాలు ఘోరాలు చేస్తూ క్రైంలో మునిగిపోయిన ప్రతిపక్షాలకు CM అంటే క్రైం మాస్టర్ అని భావిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కాని ఆంధ్రా ప్రజలకు మాత్రం CM అంటే కామన్ మ్యాన్, CM అంటే కేరింగ్ మ్యాన్. CM అంటే చంద్రన్న అవర్ మ్యాన్ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.

More Telugu News