Nirav Modi: రూ. 13 వేల కోట్లు ముంచేసిన నీరవ్ మోదీ లండన్ లో అరెస్ట్

  • హోల్ బార్న్ మెట్రో స్టేషన్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వెస్ట్ మినిస్టర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం
  • వారం క్రితం అరెస్ట్ వారెంట్ జారీ చేసిన బ్రిటన్

పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 13వేల కోట్ల మేర ముంచేసి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని ఎట్టకేలకు లండన్ లో అరెస్ట్ చేశారు. కాసేపట్లో లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో యూకే పోలీసులు ఆయనను ప్రవేశ పెట్టనున్నారని సమాచారం. అధికారుల సమాచారం ప్రకారం సెంట్రల్ లండన్ లోని హోల్ బార్న్ మెట్రో స్టేషన్ లో మోదీని అదుపులోకి తీసుకున్నారు.

నీరవ్ మోదీని అప్పగించాలంటూ ఈడీ చేసిన విన్నపం మేరకు బ్రిటన్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. అయితే, నీరవ్ మోదీని భారత్ కు అప్పగిస్తారా, లేదా అనే విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది. భారత్ కు అప్పజెప్పాలంటే అక్కడి కోర్టులో సుదీర్ఘమైన కార్యాచరణ ఉంటుంది. లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాను ఇంత వరకు భారత్ కు బ్రిటన్ అప్పగించని సంగతి తెలిసిందే.

More Telugu News