venkatesh: వెంకీ .. రవితేజ మల్టీ స్టారర్ పుకారేనట!

  • 'ఎఫ్ 2'తో హిట్ కొట్టిన వెంకీ
  •  'వెంకీమామ'తో బిజీ 
  • తరువాత ప్రాజెక్టు ఖరారు కాలేదు

ఇటీవల వెంకటేశ్ .. వరుణ్ తేజ్ ల కాంబినేషన్లో మల్టీ స్టారర్ గా వచ్చిన 'ఎఫ్ 2' భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం వెంకటేశ్ .. నాగచైతన్యతో కలిసి 'వెంకీమామ' అనే మరో మల్టీస్టారర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో రవితేజతో కలిసి వెంకటేశ్ మరో మల్టీ స్టారర్ చేయనున్నారనీ .. ఈ సినిమాకి వీరు పోట్ల దర్శకత్వం వహించనున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం.

 నిర్మాత అనిల్ సుంకరకి వెంకటేశ్ ఒక సినిమా చేయవలసి ఉందట. అనిల్ సుంకర రిఫరెన్స్ తో దర్శకుడు వీరు పోట్ల ఒక కథను వెంకటేశ్ కి వినిపించాడట. అయితే ఈ విషయంపై వెంకటేశ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఈలోగానే ఇది మల్టీ స్టారర్ అనీ .. వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనే వార్తలు షికారు చేశాయి. ప్రస్తుతానికి ఇది మల్టీ స్టారర్ కాదనే విషయం మాత్రం స్పష్టమైపోయింది. ఇక వీరు పోట్లకి వెంకీ ఓకే చెప్పడం కూడా కష్టమేననే టాక్ కూడా మరోవైపున వినిపిస్తోంది.

More Telugu News