raj tarun: దిల్ రాజు బ్యానర్లో ఛాన్స్ కొట్టేసిన మేఘా ఆకాశ్

  • నితిన్ జోడీగా రెండు సినిమాలు
  • పలకరించని విజయాలు 
  • దిల్ రాజు సినిమాపైనే ఆశలు

తెలుగు తెరకి 'లై' సినిమా ద్వారా మేఘా ఆకాశ్ పరిచయమైంది. ఈ సినిమా తరువాత మళ్లీ నితిన్ జోడీ కడుతూ 'ఛల్ మోహన్ రంగా' చేసింది. దురదృష్టవశాత్తు ఈ రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. దాంతో ఈ అమ్మాయికి ఇక్కడ అవకాశాలు ముఖం చాటేశాయి. అందరిలానే తాను కూడా తమిళ చిత్రపరిశ్రమకి వెళ్లి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

ఈ నేపథ్యంలోనే తెలుగు నుంచి ఆమెకి ఒక అవకాశం వెళ్లింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు .. దర్శకుడు కృష్ణారెడ్డితో ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ దర్శకుడు ఇంతకుముందు 'ఆడు మగాడ్రా బుజ్జీ' సినిమా చేశాడు. రాజ్ తరుణ్ ను కథానాయకుడిగా ఎంచుకున్న దిల్ రాజు .. కథానాయికగా మేఘా ఆకాశ్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 'నీదీ నాదీ ఒకటే లోకం' పేరుతో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పుడు మేఘా ఆకాశ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే. 

More Telugu News