Andhra Pradesh: వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో హైకోర్టును ఆశ్రయించిన జగన్

  • సిట్ వల్ల వాస్తవాలు బయటకొస్తాయన్న నమ్మకం లేదు
  • స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని వినతి
  • ఈ హత్యను బాబు రాజకీయంగా వాడుకుంటున్నారు: పిటిషన్ లో జగన్

వైఎస్ వివేకా హత్య కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ ఏపీ హైకోర్టును జగన్ ఆశ్రయించారు. ఈ మేరకు ఈరోజు ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుునాయుడు, డీజీపీ ఠాకూర్ ప్రమేయం లేని స్వతంత్ర సంస్థకు కేసు అప్పగించాలని ఆ పిటిషన్ లో కోరారు.

వివేకా హత్యను చిన్నదిగా చూపించేందుకు సీఎం యత్నిస్తున్నారని, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ హత్యను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆ పిటిషన్ లో ఆరోపించారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వల్ల వాస్తవాలు బయటకు వస్తాయన్న నమ్మకం లేదని, అందుకే, స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసు విచారణను అప్పగించాలని జగన్ కోరారు.    

More Telugu News