cuddapah: జమ్మలమడుగులో వైసీపీ నేత మహేశ్ రెడ్డి వాహనం ధ్వంసం.. వైసీపీ-టీడీపీ కార్యకర్తల ఘర్షణ!

  • వైసీపీ పట్టణ అధ్యక్షుడు మహేశ్ రెడ్డి వాహనం ధ్వంసం
  • టీడీపీ కార్యకర్తల పనేనంటూ వైసీపీ ఆరోపణలు
  • అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, వైసీపీ శ్రేణుల ధర్నా 


కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ పట్టణ అధ్యక్షుడు మహేశ్ రెడ్డి వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అల్లరి మూకలను పోలీసులు చెదరగొట్టారు. సంఘటనా స్థలానికి వైసీపీ నాయకులు అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి చేరుకున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, వైసీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. కాగా, టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వర్గీయులు తమ వాహనాన్ని ధ్వంసం చేశారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

More Telugu News