jagan: విజయమ్మ, షర్మిల కోసం రెడీ అవుతున్న ప్రత్యేక బస్సులు

  • ప్రచార రంగంలోకి విజయమ్మ, షర్మిల
  • 27న మంగళగిరి నుంచి షర్మిల ప్రచారం
  • 40 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్న విజయమ్మ

ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ ముమ్మరం చేసింది. పార్టీ అధినేత జగన్ ఇప్పటికే సుడిగాలి పర్యటనలను ప్రారంభించారు. పోలింగ్ కు అతి తక్కువ సమయం ఉండటంతో... ప్రతి రోజు పలు బహిరంగసభల్లో ప్రసంగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కు తోడుగా ఎన్నికల ప్రచార రంగంలోకి ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల దిగబోతున్నారు. వీరిద్దరి కోసం వైసీపీ వేర్వేరుగా ప్రత్యేక బస్సులను రెడీ చేస్తోంది. ఈ నెల 27న మంగళగిరి నుంచి షర్మిల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. మొత్తం 10 జిల్లాల్లోని 50 నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం నిర్వహించనున్నారు. ఇదే సమయంలో 40 నియోజకవర్గాల్లో విజయమ్మ ప్రచారం చేయనున్నారు.

More Telugu News