Sanjay Nirupam: పారికర్ చావు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారా?: కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ వివాదాస్పద వ్యాఖ్య

  • నిత్యమూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సంజయ్ నిరుపమ్
  • అర్ధరాత్రి ప్రమాణ స్వీకారం ఏంటి?
  • ట్విట్టర్ లో వ్యాఖ్యలతో దుమారం

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు కొనితెచ్చుకుంటుండే మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్, మరోసారి అదే పని చేశారు. సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేయగా, అంత హడావుడి ప్రమాణ స్వీకారం ఎందుకని ప్రశ్నించిన సంజయ్, పారికర్ చావు కోసం బీజేపీ నేతలు ఎదురుచూస్తూ కూర్చున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. "ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆ సమయమా? చూస్తుంటే పారికర్ తుది శ్వాస విడిచే క్షణాల కోసం బీజేపీ వేచి చూస్తున్నట్టు కనిపిస్తోంది" అని ఆయన ట్వీట్ చేశారు.




More Telugu News