Hyderabad: అమీర్ పేట్-హైటెక్ సిటీ మధ్య పరుగులు తీయనున్న ‘మెట్రో'

  • 20 నుంచి అమీర్ పేట్- హైటెక్ సిటీ మధ్య మెట్రో రైలు
  • ప్రారంభించనున్న గవర్నర్ నరసింహన్  
  • మాదాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో సాఫ్ట్ వేర్ సంస్థలు

ఈ నెల 20 నుంచి అమీర్ పేట్- హైటెక్ సిటీ మధ్య మెట్రో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మార్గంలో ‘మెట్రో‘ సేవలను బుధవారం 9.30 గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు. ఈ మార్గంలో మెట్రో రైలు అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. అమీర్ పేట్-హైటెక్ సిటీ మధ్య దూరం 11 కిలో మీటర్లు. అమీర్ పేట్-హైటెక్ సిటీ  మధ్య మధురానగర్, యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నెం.5, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మ గుడి, మాదాపూర్, దుర్గం చెరువు స్టేషన్లు ఉన్నాయి.

మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని సాఫ్ట్ వేర్ సంస్థలతో పాటు ఇతర సంస్థల్లో ఉద్యోగులు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న ఉద్యోగులు తమ కార్యాలయాలకు సకాలంలో చేరుకునే విషయంలో ట్రాఫిక్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల్లో ‘మెట్రో’ సేవలు అందుబాటులోకి రానుండటంతో ఉద్యోగుల కష్టాలు తీరనున్నాయి.

More Telugu News