MS Dhoni: ఆటకు కాదు, ప్రాక్టీసుకు మాత్రమే... ధోనీ వస్తుంటే 40 వేల మంది హంగామా... వీడియో!

  • మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ మొదలు 
  • ప్రాక్టీస్ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ కు అనుమతి
  • ధోనీ వస్తుంటే దద్దరిల్లిన స్టేడియం

ఐపీఎల్ ఫీవర్ మొదలైపోయింది. మరో ఐదు రోజుల్లో చెన్నై వేదికగా పొట్టి క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ టైటిల్ ఫేవరేట్స్ గా భావిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగనుండగా, ధోనీ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు వస్తున్న వేళ, తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎస్కే ప్రాక్టీస్ మ్యాచ్ ని తిలకించేందుకు అభిమానులను అనుమతించడంతో స్టేడియంలోకి దాదాపు 40 వేల మంది ఫ్యాన్స్ వచ్చారు. ధోనీ బ్యాట్ తీసుకుని మైదానంలోకి వస్తుంటే కరతాళధ్వనులతో "ధోనీ... ధోనీ" అంటూ వేసిన కేకలతో స్టేడియం దద్దరిల్లింది. ఆ సమయంలో వారి ఉత్సాహం చూసిన ధోనీ సైతం ముసిముసిగా నవ్వుతుండగా, తీసిన వీడియోను సీఎస్కే యాజమాన్యం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియోను మీరు కూడా చూడవచ్చు.

More Telugu News