nikhil: 'అర్జున్ సురవరం' నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

  • తెలంగాణ యాసలో సాగే పాట 
  • నాయికగా లావణ్య త్రిపాఠి 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు  

నిఖిల్ హీరోగా 'అర్జున్ సురవరం' నిర్మితమైంది. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. "రాతిరి కునుకు అతుకు అతుకు .. అలుపు సొలుపుల నడుమల బతుకు .., వార్తలకొరకు ఉరుకు ఉరుకు .. అరెరే కాలు యేడా నిలవని ఉరుకు .. " అంటూ తెలంగాణ యాసలో ఈ పాట సాగుతోంది.

ఈ సినిమాలో కథానాయకుడు ఓ న్యూస్ ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేస్తుంటాడు. ఆయన వృత్తికి సంబంధించిన నేపథ్యంలోనే ఈ పాట తెరపైకి వస్తుంది. సామ్ సీఎస్ సంగీతం .. వరికుప్పల యాదగిరి సాహిత్యం .. బాగున్నాయి. రాజ్ కుమార్ - వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాతో తాను సక్సెస్ అనుడుకోవడం ఖాయమనే నమ్మకంతో నిఖిల్ వున్నాడు

More Telugu News